ఒంగోలు ప్రయాణం అధ్యాపకులందరము విద్యార్థి దశలోకి వెళ్ళిపోయిన అనుభూతి ఈ రోజు వచ్చింది. Association elections రాష్ట్ర స్థాయిలో ఒంగోలు సక్కూ భాయి మహిళా డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 9, 2025 న జరగబోతున్నాయి. ఆ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అనంతపురం జిల్లా నుంచి 30 మంది వరకు అధ్యాపకులు ఒంగోలుకు ఫిబ్రవరి 8 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ట్స్ కళాశాల నుంచి బయలుదేరాము. ప్రయాణానికి ఏర్పాటు చేసిన బస్సు చాలా సౌకర్యవంతంగా ఉంది. నేను అందరికంటే ముందుగా వెళ్లి సింగల్ సీట్ లో కూచుండి పోయాను. చేతిలో ఒక బ్యాగ్ తప్ప ఎవరికీ పెద్ద లగేజ్ లేదు. బస్సు ఎక్కడానికి ముందే అందరూ blissful mood లోకి వచ్చేసారు. ఈ టూర్ మొత్తం మనోహర్ రెడ్డి, శేషయ్య మరియు సోమశేఖర్ ఆధ్వర్యంలో నడుస్తోంది. బయలుదేరడానికి ముందు రోజే నేను గూగుల్ లో ఒంగోలు చుట్టుపట్ల ఉన్న ప్రదేశాల గురించి వెతికి పట్టుకున్నాను. ఎక్కడికి ...